18 ఏళ్ళు పైబడిన వారందరికీ వ్యాక్సిన్..
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం తీసుకుంది.దేశంలో విడతల వారీగా ఇచ్చిన వ్యాక్సిన్ ను ఇప్పుడు 18 ఏళ్ళు పైబడిన వారందరికీ దేశ వ్యాప్తంగా మే 1 నుండి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రధానమంత్రి మోదీ వ్యాక్సిన్ ఫర్ అల్ అనే ప్రకటన చేశారు. ఇప్పటి వరకు 45 ఏళ్ళు పైబడిన వారికీ వ్యాక్సిన్ ఇచ్చారు. ప్రధాన మంత్రి మోదీ ఇప్పుడు తీసుకున్న సంచలనం నిర్ణయంతో దేశంలో ఉన్న 18 ఏళ్ళు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.