వరంగల్,ఖమ్మం,సిద్దిపేట్ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ హవా.. వి ద పబ్లిక్ పల్స్ సంచలన సర్వే..

వరంగల్,ఖమ్మం,సిద్దిపేట్ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ హవా.. వి ద పబ్లిక్ పల్స్ సంచలన సర్వే..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: వరంగల్, ఖమ్మం,సిద్దిపేట్ మున్సిపాలిటీల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించాయి . పలు సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దాదాపు మెజారిటీ సర్వే సంస్థలు అధికార పార్టీ టీఆరెస్  గెలుస్తుందని తేల్చి చెప్పాయి. ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని వి ద పబ్లిక్ పల్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. కాగా వి ద పబ్లిక్ పల్స్ వ్యవస్థాపకులు టీ.రాధాకృష్ణ సామజిక మాధ్యమాల్లో నిర్వహించిన ఈ సర్వేలో వరంగల్ ఖమ్మం సిద్దిపేట్ ప్రజలు పాల్గోని వారి అభిప్రాయాలను తెలిపారు. ఈ క్రమంలో వి ద పబ్లిక్ పల్స్ వ్యవస్థాపకులు రాధాకృష్ణ మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. మూడు మున్సిపాలిటీలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజల మద్దతు టీఆరెస్ కు ఉందని అయన తెలిపారు. టీఆరెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలు బాగా తృప్తి చెందారని వారు నిర్వహించిన సర్వేలో తేలిందని ఈ క్రమంలో తెరాస విజయ డంకా మోగిస్తుందని అయన అన్నారు. వి ద పబ్లిక్ పల్స్ గతంలో నిర్వహించిన దుబ్బాక, జి.ఎచ్.ఎం.సి, ఎమ్మెల్సీ ఎన్నికల సర్వే వారు ఊహించిన విధంగానే వచ్చిందని అయన అన్నారు. కాగా వరంగల్,సిద్దిపేట్ మున్సిపాలిటీలు టీఆరెస్ కైవసం చేసుకుంటుందని కానీ ఖమ్మంలో ఓట్లు చీలే అవకాశం ఉందని కొన్ని స్థానాలు ఇండిపెండెంట్లు ఇతర పార్టీలు అభ్యర్థులు దక్కించుకుంటారని రాధాకృష్ణ అన్నారు. తమ సర్వే అన్ని పార్టీలకు అతీతంగా ఉంటుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published.