హైదరాబాద్/నల్గొండ జిల్లా: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిని సీఎం కేసీఆర్ ఎట్టకేలకు ప్రకటించారు. ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంఛార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు ప్రకటించారు. మునుగోడులో 70 శాతానికిపైగా బీసీ ఓటర్లు ఉన్నారు. దీంతో సర్వేల ఆధారంగా కూసుకుంట్ల వైపే కేసీఆర్ మొగ్గు చూపారు. మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జ్గా ఉన్న కూసుకుంట్ల..ఈనెల 10న నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్కు మంత్రులు కేటీఆర్, హరీష్రావు, జగదీష్రెడ్డి హాజరుకానున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ నుంచి రాజగోపాల్రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు.