రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్కు అస్వస్థత..
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ స్వల్ప అస్వస్థతకు గురై న్యూఢిల్లీ లోని ఆర్మీ ఆసుపత్రిలో చేరారు. ఆర్మీ వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం రాంనాథ్ కోవింద్ కు శుక్రవారం ఉదయం ఛాతిలో స్వల్ప ఇబ్బంది తలెత్తడంతో రాంనాథ్ కోవింద్ను ఆర్మీ ఆసుపత్రికి తరలించారు వెంటనే అన్ని పరీక్షలు నిర్వహించి సాధారణ ఛాతి నెప్పి అని నిర్దారించిన వైద్యులు . ప్రస్తుతం రాంనాథ్ కోవింద్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆర్మీ వైద్యులు పేర్కొన్నారు.