రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బస్తి బాట..

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బస్తి బాట..

ఆర్.బి.ఎం రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్ బస్తీలో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పర్యటించారు. అక్కడ స్థానికులు కాలనీలో గలా పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వర్షాలు కురిస్తే వరద నీరు వచ్చి రాకపోకలకు సమస్యా వుందని, డ్రైనేజీ, రోడ్డు మరమ్మతులు మరియు తాగునీటి సమస్యలను పరిష్కరిచాలని స్థానికులు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను కోరారు.

ఈ సందర్బంగా ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ ఈస్టలం విషయం TSAPARD ప్రభుత్వం వద్ద ఉంది కాబట్టి అభివృద్ధి పనులకు ఆటకం ఏర్పడుతుందని గతంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తాను సమస్య తీసుకెళ్లినట్లు గుర్తు చేశారు. త్వరలో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సమస్య తీర్చేందుకు ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ప్రస్తుతానికి రోడ్డు మరమ్మతులు,తాగునీటి పలు సమస్యలను తీర్చలని GHMC అధికారులకు ప్రకాష్ గౌడ్ పలు సూచనలు చేశారు.బస్తి పర్యటనలో జగన్,EE నాగేందర్,పార్టీ ప్రెసిడెంట్ ధర్మ రెడ్డి, సెక్రటరీ మహేష్,శ్రవణ్,రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.