పవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదంటూ తెలుగు ఫిల్మ్ చాంబర్.. మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతల భేటీ..

పవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదంటూ తెలుగు ఫిల్మ్ చాంబర్.. మంత్రి పేర్ని నానితో సినీ నిర్మాతల భేటీ..

ఆర్.బి.ఎం అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యల తర్వాత ఏపీ చుట్టూ సినీ రాజకీయం తిరుగుతోంది. రిపబ్లిక్ సినిమా ఫంక్షన్లో పవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదంటూ తెలుగు ఫిల్మ్ చాంబర్ ప్రకటించింది. పవన్ ఏపీ పర్యటన రోజే మంత్రి పేర్ని నానితో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, డీవీవీ దానయ్య, సునీల్ నారంగ్, బన్నీ వాసు భేటీ అయ్యారు. ఆన్‌లైన్లో సినిమా టికెట్ల అమ్మకానికి నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ అంగీకరించింది. సినిమా హాళ్ల నిర్వహణ, విద్యుత్ చార్జీల్లో రాయితీలు, సినిమా నిర్మాణంలో ప్రొత్సాహకాలపై సహకరించాలని ఏపీ ప్రభుత్వాన్ని టీఎఫ్ఐ కోరింది. కొన్ని సినిమాలకైనా బెనిఫిట్ షోలకు వెసులుబాటు కల్పించేలా చూడాలని ఏపీ ప్రభుత్వానికి ఫిల్మ్ చాంబర్ ప్రతినిధుల విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పేర్ని-దిల్ రాజు భేటీలో ఈ అంశాలతో పాటు పవన్-పోసాని కామెంట్ల పైనా ప్రస్తావన వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వివాదం త్వరగా ముగిస్తే బాగుండునని సినీ పెద్దలు అనుకుంటున్నారు.

ప్రభుత్వ ఆలోచనలను పవన్ తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. పవన్ వ్యాఖ్యలతో ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు విభేదించారు. ఏపీ సీఎంతో మాట్లాడాలంటూ తన ప్రసంగంలో దిల్‌రాజు పేరును పవన్ ప్రస్తావించారు. ప్రభుత్వ నిర్ణయనికే తమ మద్దతు ఉంటుందని పలువురు నిర్మాతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పేర్ని నాని – దిల్ రాజు భేటీకి ప్రాముఖ్యత సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published.