ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఉప సభాపతి పద్మారావు గౌడ్..

ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఉప సభాపతి పద్మారావు గౌడ్..

ఆర్.బి.ఎం సికింద్రాబాద్ : ప్రజలకు ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు పడకూడదని ఆకాంక్షిస్తున్నట్లు పద్మారావు గౌడ్ తెలిపారు. నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా చరిత్రాత్మకమైన చిలకలగుడా కట్ట మైసమ్మ ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అన్ని ప్రతి కూల పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని అమ్మవారు అందించాలని పద్మారావు గౌడ్ అభిలషించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, తెరాస నేతలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.