విష్ణు గెలిచాక రెండు రాష్ట్రాల సీఎంలను కలుస్తాం: మోహన్‌బాబు

విష్ణు గెలిచాక రెండు రాష్ట్రాల సీఎంలను కలుస్తాం: మోహన్‌బాబు

ఆర్.బి.ఎం డెస్క్: ‘మా’ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రకాష్‌రాజ్ ప్యానల్, మంచు విష్టు ప్యానల్ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికలు విమర్శలు, ప్రతి విమర్శలకు కేంద్రంగా మారాయి. రెండు పక్షాలు ఒకరిపై ఒకరి తీవ్రమైన విమర్శలు చేసుకుంటున్నారు. ఆదివారం ఉదయం మా అసోషియేషన్ ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు ఓ వీడియో సందేశాన్ని ఓటర్లకు పంపారు. ‘’మా’ ఎన్నికల పరిస్థితి చూస్తే మనసుకు కష్టంగా ఉంది. ‘మా’ అధ్యక్షుడిని ఏకగ్రీవం చేయాలని గతంలో పెద్దలంతా కోరుకున్నారు. కానీ.. ఇప్పుడు కొందరు బజారుకెక్కి పరువు తీస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ఎవరేంచేసినా ‘మా’ అనేది ఒక కుటుంబం. మనస్సాక్షితో ఆలోచించి ఓటేయండి. విష్ణు గెలిచాక రెండు రాష్ట్రాల సీఎంలను కలుస్తాం. సినీ పరిశ్రమ కష్టాలను సీఎంలకు చెప్పకుందాం’’ మోహన్‌బాబు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.