కాంగ్రెసోళ్లకు నేనంటే ఇష్టం.. ప్రధాన మంత్రి మోదీ..
ఆర్.బి.ఎం : లోక్ సభ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు తనంటే ప్రాణం అని, మోదీ లేకుండా వాళ్ళు ఒక్క నిమిషం కూడా జీవించలేరని విమర్శించారు. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ తన హద్దులను దాటి ప్రవర్తించిందని మోదీ ఆరోపణలు గుప్పించారు. కరోనా వైరస్ వ్యాప్తిని చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులేనని మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.