తెలంగాణాలో పెరిగిపోతున్న కరోనా కేసులు..
ఆర్.బి.ఎం హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 26,976 కరోనా పరీక్షలు నిర్వహించగా 516 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. 261 కొత్త కేసులు హైదరాబాద్ లో నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 434 మంది కరోనా బారి నుండి బయటపడ్డారు. తాజాగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు. కరోనా బారిన పడి 4,784 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని అధికారులు తెలిపారు..