వీరశైవ లింగాయత్ లను ఓబీసీలో చేర్చాలి: బీబీ పాటిల్,జహీరాబాద్ ఎంపీ
ఆర్.బి.ఎం హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ కార్యాలయంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ వీరశైవ లింగాయత్ లను కేంద్రంలో ఓబీసీలో చేర్చే విషయమై బిసి కమిషన్ చైర్మన్ వకళాభరణం కృష్ణమోహన్, మరియు కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, సిహెచ్ ఉపేంద్ర, కే కిషోర్ గౌడ్ లను కలిసి గతంలోనే కేంద్ర ఓబీసీ కమిషన్ కు తెలంగాణ ప్రభుత్వం నుండి చేసిన సిఫార్సును మరల సిఫారస్ చేయాల్సిందిగా మరియు కేంద్ర సోషల్ జస్టిస్ మరియు ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖ కు సిఫార్సు చేయాల్సిందిగా వినతి పత్రం అందజేశారు.