డ్రగ్స్ ఏ ఎమ్మెల్యే వాడుతున్నారో కెసిఆర్ కు తెలుసు: బండి సంజయ్

డ్రగ్స్ ఏ ఎమ్మెల్యే వాడుతున్నారో కెసిఆర్ కు తెలుసు: బండి సంజయ్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: గతంలో సినీ,రాజకీయ ప్రముఖుల డ్రగ్స్ వ్యవహారం సంచాలని సృష్టించింది. తాజాగా మరోసారి డ్రగ్స్ తెలుగు రాజకీయాల్లో కలకలం రేపుతోంది. గత కొద్దీ రోజులుగా తెరాస ఎమ్మెల్యేలు డ్రగ్స్ వాడుతున్నారు అని అన్ని టీవీ ఛానెల్స్లో ప్రసారమయ్యాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి వచ్చే తెరాస ఎమ్మెల్యేలకు డ్రగ్స్ టెస్టులు చేయించాలి అని బండి సంజయ్ అన్నారు. తెరాస ఎమ్మెల్యేలు ఎవరెవరు డ్రగ్స్ వాడుతున్నారో తెరాస అధినేత కెసిఆర్ కు తెలుసని బండి సంజయ్ అన్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ వాడుతున్న ఎమ్మెల్యేలను వెంటనే రాజీనామా చేయించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాగా ఎమ్మెల్యేలు మంత్రులు డ్రగ్స్ దందా చేస్తున్నారని అన్నారు. తెరాస ఎమ్మెల్యేలకు డ్రగ్స్ టెస్టులు నిర్వహించాలని తాను కూడా శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని బండి సంజయ్ కెసిఆర్ కు సవాల్ విసిరాడు.

Leave a Reply

Your email address will not be published.