రెండో విడత హరిత హారాన్ని ప్రారంభించిన ఉప సభాపతి పద్మారావు గౌడ్..

రెండో విడత హరిత హారాన్ని ప్రారంభించిన ఉప సభాపతి పద్మారావు గౌడ్..

ఆర్.బి.ఎం హైదరాబాద్, సికింద్రాబాద్ : సికింద్రాబాద్ పరిధిలో అన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించే ఏర్పాట్లు జరుపుతున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. చిలకలగూడ లోని మున్సిపల్ మైదానంలో రెండో విడత హరిత హారాన్ని శనివారం తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ప్రకృతిని పరిరక్షించాలని, ముక్కలను విరివిగా నాటాలని కోరారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు రాసురి సునీత, కుమారి సామల హేమ, తెరాస యువ నేతలు కిశోరే కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, ఉప కమీషనర్ మోహన్ రెడ్డి, అధికారులు ఆశలత, రాఘవేందర్, రమణ రెడ్డి, అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, అధికారులు, నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.