కరోనా నేపథ్యంలో బ్యాంకులు మధ్యాహ్నం వరకే..
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: కరోనా తీవ్రత క్రమంగా పెరుగుతూనే ఉంది. కరొనను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటునప్పిటికి కరోనా అదుపులోకి రావడం లేదు. రోజు అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదౌతున్నాయి. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాలు నైట్ కర్ప్యూ విధించారు. కాగా ఇప్పటికే పలు రంగాలలోని పని సమయాన్ని కుదించారు. ప్రజలకు అందుబాటులో ఉండే బస్సులు ట్రైన్ల సమయం కూడా మార్చిన విషయం తెలిసిందే. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ తాజాగా బ్యాంకింగ్ రంగంలోనూ పనివేళలు కుదిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. కరొనను నియంత్రించే క్రమంలో బ్యాంకులు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే ప్రజలకు అందుబాటులో ఉంటాయని వరకు తెలిపారు.
ఈ రోజు నుండి (శుక్రవారం) వచ్చే నెల మే 15 వరకు బ్యాంకుల పని సమయం కుదింపు అమలులో ఉంటుందని వారు పేర్కొన్నారు. బ్యాంకులకు వచ్చే కస్టమర్లు అత్యవసరమైతే తప్ప బ్యాంకుకు రావొద్దని తెలిపారు. బ్యాంకు లో జరిగే లావాదేవిలని అలానే జరుగుతాయని వారు తెలిపారు. కాగా బ్యాంకు లో పనిచేస్తున్న ఉద్యోగులంతా కచ్చితంగా వాక్సిన్ తీసుకోవాలని సూచించారు.