మరోసారి చంద్రబాబుకు నోటీసులు..

మరోసారి చంద్రబాబుకు నోటీసులు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు మరోసారి అధికారులు నోటీసులు జారీచేశారు. వర్షాల నేపథ్యంలో కృష్ణా నది కరకట్ట లోపలవైపు ఉండే చంద్రబాబు నివాసంతో పటు మరో 36 ఇళ్లకు ప్రమాద హెచ్చరికలు జారీచేస్తూ వారికీ నోటీసులు ఇచ్చారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ఇక్కడ ఉండడం సురక్షితం కాదు అని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారులు జారీ చేసిన నోటీసులలో సూచించారు. వరద ప్రవాహం పెరిగి ఏ క్షణంలో నైనా నీరు ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉందని వారు తెలిపారు. అయితే కృష్ణా నదిలో 6లక్షల క్యూసెక్కులకు మించి వరద వచ్చే అవకాశాలున్నాయని వారు తెలిపారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీలో వరద ఉధృతి పెరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published.