నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఏడుస్తూ ప్రచారం నిర్వహించిన అభ్యర్థి ..

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఏడుస్తూ ప్రచారం నిర్వహించిన అభ్యర్థి..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా  అన్ని  పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం కోసం రాజకీయ నాయకులు వివిధ రకాలుగా ప్రచారం నిర్వహిస్తుంటారు. ప్రచారంలో భాగంగా అభ్యర్థులు చేయని పనులు అంటూ ఉండవు. కాగా బీజేపీ అభ్యర్థి రవి కుమార్ నాయక్ మాత్రం పూర్తిగా భినంగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. ప్రచారంలో నాయకులు నన్ను గేలిపిస్తే మీకు అది చేస్తా ఇది చేస్తా అంటారు కానీ ఈ అభ్యర్థి మాత్రం ప్రచారంలో ఏడుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నాడు. ఓటు తనకే వేయాలని ఏడుస్తూ శుక్రవారం త్రిపురారం మండల పరిధిలోని అయన స్వగ్రామంలో పలుగుతండాలో రవి కుమార్ ‌ ప్రచారం నిర్వహించారు. తన భార్యను వారి గ్రామంలో సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని. తనను నమ్మి బీజేపీ అధిష్టానం తనకు టికెట్ ఖరారు చేసిందని ప్రతి ఒక్కరు తనకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని తండా వాసులను అభ్యర్థించారు. ఓడిపోతానేమోనని తమ బంధువుల వద్దకు వెళ్లి బోరున విలపించారు. తనకు భయంగా ఉందంటు బంధువులతో కన్నీటిపర్యంతం అయ్యాడు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి రవి కుమార్ నాయక్.

Leave a Reply

Your email address will not be published.