లాల్ దర్వాజలో అమ్మవారికి బోనం ఎత్తిన భక్తులు
హైదరాబాద్: తెలంగాణలో బోనాల పండుగకు ప్రత్యెక్యమైన గుర్తింపుంది సంసృతిసంప్రదాయలకు ప్రతీగా అషాడ మాసంలో వచ్చే బోనాల పండుగా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అమ్మవారి అలయాలను విద్యుత్ దిపాలతో రంగులతో ముస్తాబు చేసి బోనాల పండుగను భక్తులు భక్తి శ్రధలతో జరుపుకుంటారు. బోనాల పండుగా ముఖ్యంగా గ్రామల్లో కంటే హైదరాబాద్ నగరంలో చాలా విశిష్టింగా జరుపుతారు. నగరంలో ఉన్న సికింద్రబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజలోని అలయాలకు ప్రత్యేక్యమైన గుర్తింపుంది.
ఎంతో వైభవంగా జరగాల్సిన బోనాల పండుగా నిరాడంబరంగా జరుపుకోవాల్సిన పరిస్థితి ఎర్పడింది. అమ్మవారికి భక్తి శ్రథలతో బోనాలు సమర్పించి ఘనంగా ఉత్సవాలు జరుపుతారు. బోనాల ఉత్సవాల్లో శివశత్తుల ఆటలు పోతురాజుల విన్యాసాలు ఎంతగానో అకట్టుకుంటాయి.పలహారం బండ్ల ఉరేంగిపు కార్యక్రమానికి నగరంలో ప్రత్యేక్యమైన గుర్తింపు సంతరించుకుంది.
కరోన వ్యాప్తి నేపధ్యంలో తెలంగాణలో ఉత్సవాలు జరుపుటకు తెలంగాణ ప్రభుత్వం నిరాకరించింది. నగరంలోని లాల్ దర్వాజ అలయంలో బోనాల వేడుకలు అదివారం తెల్లవారు జమున మొదలైయ్యాయి. అలయంలోకి భక్తులకు ప్రవేశం లేకపోవడంతో అలయ కమీటి వారు మత్రమే పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నరు. అమ్మవారికి జల కడప అర్చకులు సమర్పించారు.
అలయాల్లోకి భక్తులు ప్రవేశించాకుండా అలయాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఎర్పటు చేసిన అధికారులు. ఈ క్రమంలో భక్తులు ఎవరి ఇళ్లలో వారే అమ్మవారికి బోనాలు నైవేద్యాలు సమర్పించుకున్నారు.