ఈటెల గెలుపుతో దన్నారం లో బీజేపీ నాయకుల సంబరాలు

ఈటెల గెలుపుతో దన్నారం లో బీజేపీ నాయకుల సంబరాలు

 ఆర్.బి.ఎం వికారాబాద్:   హుజురాబాద్ లో జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ 23 వేలకు పైగా భారీ మెజారిటీతో అధికార టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై గెలుపొందడంతో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం రేకెత్తింది. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని దన్నారం గ్రామంలో బీజేపీ యువ నాయకుల సంబరాలు అంబరాన్ని అంటాయి. బిజెపి నినాదాలతో హోరెత్తించి, బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, యువ మోర్చా రాష్ట్ర నాయకులు చిట్యాల చరణ్ రెడ్డి లు మాట్లాడుతూ ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య జరిగిన పోరులో బిజెపి జెండా రెపరెపలాడిందన్నారు.హుజురాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పు రాష్ట్ర నూతన భవిష్యత్తుకు నాంది పలికిందన్నారు.రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బిజెపి నేత డా,చంద్రశేఖర్ తనయుడు,బిజెపి యువ నాయకులు,గ్రామస్థులు,పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published.