పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు: పూలపల్లి రాజేందర్ రెడ్డి,బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్

పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు: పూలపల్లి రాజేందర్ రెడ్డి,బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: సెప్టెంబర్ 1 వ తేదీన నుండి తెలంగాణాలో విద్యాసంస్థలు పునర్‌ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో బండ్లగూడ జాగీర్ లోని హైదర్షా కోట్ ప్రభుత్వ పాఠశాలలు.అంగన్వాడీలను,ప్రాధమిక పాఠశాలను బండ్లగూడ జాగీర్ మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలంగాణాలో విద్యాసంస్థలను పునర్ ప్రారంభించాలని నిర్ణహించుకున్నారని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం వెనుకడుగు వేసేదే లేదని రాజేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని రాజేందర్ రెడ్డి వెల్లడించారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ రావాలని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్ రెడ్డి సూచించారు.

Leave a Reply

Your email address will not be published.