బీజేపీకి, టీఆరేస్ కు ప్రత్యన్యాయ పార్టీ కాంగ్రెస్: గుడిమల్కాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేణు గౌడ్

హైదరాబాద్: గుడిమల్కాపూర్ కాంగ్రేస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి వేణు గౌడ్ గుడిమల్కాపూర్ లోని పలు బస్తీలో ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ,టీఆరెస్ పార్టీలను ప్రజలు నమ్మి ఇప్పటికే మోసపోయారని వేణు గౌడ్ మీడియా ముఖంగా వెల్లడించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు పేదవారికి ఎక్కడ కూడా అందడం లేదని అన్నారు. వరద బాధితులకు ఇస్తామని చెప్పిన డబ్బులు అవి నేరుగా నాయకుల జేబుల్లోకి వెళ్లాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోనైనా కేంద్రంలోనైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని ఈ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి తమ ఓటును వేయాలని ఆయన కోరారు. గుడిమల్కాపూర్ లో ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ స్థలాలు కబ్జా కొర్రల్లో పడ్డాయని తనకి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే అభివృద్ధికి మారు పేరుగా గుడిమల్కాపూర్ ను తీర్చిదిద్దుతామని వేణు గౌడ్ అన్నారు. వేణు గౌడ్ ప్రచారం చేసే ప్రాంతాల్లో అడుగడుగునా ప్రజలు బ్రాహ్మరథం పడుతున్నారు. వందలాది మంది యువకులు ఆయనతో పాటు ప్రచారంలో పాల్గొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.