ప్రతిష్టాత్మకంగా అమిత్ షా సభ: డా.ఏ.చంద్రశేఖర్, మాజీ మంత్రి
ఆర్.బి.ఎం వికారాబాద్: ఈ నెల 14 న తుక్కుగూడ లో జరుగనున్న కేంద్ర మంత్రి అమిత్ షా బహిరంగ సభ పై మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గనికి చెందిన మండలాల బిజెపి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మరియు ముఖ్య నాయకులతో జన సమీకరణ పై సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేసిన మాజీ మంత్రి ఎ చంద్రశేఖర్. అమిత్ షా సభ కు పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని ఆయన నేతలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గనికి చెందిన మండల అధ్యక్షులు ,ప్రధాన కార్యదర్శులు నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.