గంజాయి సరఫరాలో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానం

అమరావతి: దేశంలోనే గంజాయి సరఫరాలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో నిలిచింది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో 2021 నివేదికను వెల్లడించింది. గత ఏడాది మాదకద్రవ్యాలపై ఎన్సీబీ నివేదికను బయటపెట్టింది. దేశ వ్యాప్తంగా ఏడు లక్షల కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అత్యధికంగా ఏపీ నుంచి అంటే 26% గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోనే రెండు లక్షల కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి సరఫరాలో ఒడిషా రెండో స్థానంలో ఉంది. 50 శాతానికి పైగ ఆంధ్ర, ఒడిస్సా రాష్ట్రాల నుంచే గంజాయి సాగవుతోందని అధికారులు తెలిపారు. గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో 18 కిలోల హాశిష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరాపై 1775 కేసులు నమోదు చేశారు.

ఏపీలో గంజాయి తరలిస్తూ 4202 మంది పోలీసులకు పట్టుబడ్డారు. అలాగే హెరాయిన్ కేసుల్లో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా 7618 కిలోల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో గుజరాత్‌లో 3334 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది తెలంగాణలో 35270 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్సీబీ నివేదిక ప్రకారం అత్యధిక మత్తుపదార్థాల ప్రభావం పంజాబ్‌‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.